చిహ్నం
×

డిజిటల్ మీడియా

17 జనవరి 2022

యువతలో హార్ట్ ఎటాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి

సుఖ​వం’త’మైన జీవనం కోసం సమ’కూర్చు’కుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిఙ్ఞానలే మనిషి ఆయు’వును తగ్గిం చే’స్తున్నాయి. ఓ వైపు టెక్నా’లజీ పెరుగు’తు’న్నది, వైద్యరంగం కొత్త పుంతలు తొక్కు’తున్నది. మరో వైపు.. మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరుగెడుతోంది. ఒకప్పుడు 60 మంది పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. నేడు, 40 ఏండ్లలోపు వారినీ హృద్రోగం మింగేస్తు’న్నది. చిన్నవయసులో గుండె సమస్యలకు అనేక కారణాలు.

గుండెకు శత్రువులు.. రక్త’పోటు, మధు’మేహం. కానీ, ఐటీవలి కాలంలో ఈ రెండు సమస్యలూ లేక పోయైనా గుండె’పోటు బారి’న’పడు’న్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవటం. కొన్ని సార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె’చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే..

ధూమపానం

గుండెపోటుకు కనిపిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగవల్ల రక్తం చిక్కబడుతోంది. ఫలి’తంగా, గడ్డ’కట్టే తత్త్వం పెరిగి’పోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠి నంగా మారుతాయి. ఫలి’తంగా రక్త’పోటు అధికం అవు’తుంది. మంచి కొలెస్ర్టాల్ తగ్గిపోయి, చెడు కొలెస్ర్టాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ధూమపానం చేసే వారికి గుండెపోటు వస్తే కనుక, మందులు కూడా సమర్థంగా పనిచెయవు. స్మోకింగ్‌ మానేసిన తరు వాత అయినా, గుండెపోటు రిస్క్‌ తగ్గాలంటే.. కనీసం రెండేండ్లు పడుతోంది. అసలు ధూమపానం అంటే ఏమిటో తెలి’యని’వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరా’లంటే.. 10 నుంచి 15 ఏండ్ల సమయం పడుతోంది. ఇత రులు తాగిన పొగను పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్‌ 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. దీన్నే 'పాసివ్‌ స్మోకింగ్‌' అంటారు.

వంశ పారంపర్యం

గుండె పోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. తండ్రికి 55 ఏండ్ల లోపే గుండె పోటు వచ్చినా.. తల్లికి 65 ఏండ్ల లోపు గుండె పోటు వచ్చినా.. వారి సంతానానికి చిన్న వయసులోనే గుండె పోటు వచ్చే ఆస్కారం అధికం.

కొలెస్ర్టాల్‌తో సమస్యలు

నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ర్టాల్ పేరు వ్యాయామం లేకపోవటం వల్ల మంచి కొలెస్ర్టాల్ తగ్గుతుంది. ఆ మేరకు చెడు కొలెస్ర్టాల్‌ అధి‘క’మైపోయి’ గుండెపై భారం పడుతోంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ర్టాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబ’కా’యు’ల్లోనే అధిక కొలెస్ర్టాల్‌ ఉంటు౦ద’నేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్నవారిలోనూ అధిక కొలెస్ర్టాల్ ఉండవచ్చు. కాబట్టి, తరచూ కొలెస్ర్టాల్‌ పరీక్షలు చేయించుకో’వడం ఉత్తమం. ఆహారంలో మార్పుచేర్పులు కూడా అవసరమే.

ఆహారపు అలవాట్లు

గత పదేండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకొనే అలవాటు తగ్గిపోవచ్చు. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌, ప్రాసెడ్‌ ఫుడ్‌ ఆరగిం చడం ఫ్యాషన్‌గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతున్నది. కొలెస్ర్టాల్‌, షుగర్‌ స్థాయులూ హద్దుమీరుతున్నాయి.

అధిక బరువు, ఊబకాయం

అధిక రక్త పోటు, మధు మేహం, చెడు కొలెస్ర్టాల్‌కు ప్రధాన కారణం.. బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధరణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్‌లకు ప్రారంభ దశగా భావించాలి. ఊబకాయం హఠాత్తుగా రాదు. క్రమంగానే బరువు పెరుగుతుంది. తొలి దశలోనే నియం’త్రిం చడం ఉత్తమం.

శారీరక శ్రమ లేకపోవటం

శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలామంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకుతో హెల్త్ చెకప్లకు దూరం అవుతోంది. దీంతో యువతలో బీపీ, షుగర్‌, కొలెస్ర్టాల్‌ స్థాయులు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండె’పోటుకు దారి’తీ’స్తోంది.

మితిమీరిన వ్యాయామమూ

సాధరణంగా, పుట్టిన ఏడాది కాలం నుంచీ ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్‌లో ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పేరు అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపింది. అనారోగ్యక‌ర‌మైన ఆహారపు అల‌వాట్లు, జీవన శైలి ఫ‌లితంగా ఈ బ్లాకేజ్‌ ఒక్క‌సారిగా తీవ్రం అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరి’ణమిం చవచ్చు. నిత్యం వ్యాయామం చేయకుండ, ఒకే మితి మీరిన కస‌ర‌త్తుకు సిద్ధ‌ప‌డితే గుండె మీద భారం పడుతుంది. అది గుండె’పోటుకు దారితీసే ఆస్కారం ఉంది.. జిమ్’ వర్క’వుట్స్‌తో హృదయ స్పందన అక’స్మా’త్తుగా పెరిగి’పోతుంది. ఫలితం దీనితో, గుండె పోటు వస్తుంది.

మానసిక ఒత్తిడి

గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. రోగనిర్ధారణ కాలం నుంచీ ప్రతి ఇల్లూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో బిజీ బిజీగా కనిపిస్తోంది. మినీ ఆఫీ’సుగా మారు’తున్నది. ఇంట్లో నుంచే పని చేస్తుం’డటంతో సేదతీరే అవకా’శమూ లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోన్నది యువత. కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలూ’మ’గల బంధాలకు బీటలు.. తదితర కారణాల వల్ల మానసిక రుగ్మతలు అధికం అవుతాయి. ఈ 'సైకా’ల’జికల్‌ స్ర్టెస్‌’ కూడా గుండె’పోటుకు ఓ కారణమే.

 

మదక ద్రవ్యాల వినియోగం

యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నది. గుండె’పోటుకు గుర’వు’తు’నలభై ఏండ్లలోపు వారిలో మాదక ద్రవ్యాలు తీసు’కుం’టున్న’వారి సంఖ్య తక్కువేం కాదు. మత్తు పదార్థాల వల్ల రక్తనాళాలు కుంచించుకు పోతాయి. గుండెకు రక్త సరఫరా మంద’గించి గుండె’పోటుకు దారి తీస్తుంది.

రక్తనాళాలుచితికిపోవడం

 

రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. కాకపోతే, రక్తనాళాలు చితికిపోవటం లేదా పగిలిపోవటం చాలా అరుదైన పరిణమం. దీనికి కచ్చితమైన కారణాలు చెప్పలేం. స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ ఈ ప్రమాదం పొంచి ఉంది.

గుండెపోటు లక్షణాలు

75 శాతం యువతలో గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి రాదు. నేరుగా గుండె పోటే వచ్చేస్తుంది.

కొండ‌రిలో ఛాతీ మధ్య భాగంలో మంటగా, బిగు‌తుగా, బరువుగా ఉంటుంది. ఈ సమస్య ఎడమ చేతికి లేదా గొంతుకు పాకుతుంది. చెమటలు పట్టడం, వాంతులు కావడం వంటి లక్షణాలూ కనబడవచ్చు. చాలా సంద‌ర్భాల్లో ఈ లక్షణాల్ని గార్టిక్‌ లేదా కండ‌రాల సమ‌స్యగా పొర‌బడే అవ‌కాశం ఉంది.

తక్షణం దవాఖానకు వెళ్లక’పోతే గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి ఆక’స్మిక మరణం సంభవిం’చవచ్చు. బాధితులను 3 నుంచి 4 గంటల్లో హాస్పి‌ట‌ల్‌కు తీసుకెళ్తే, కోలుకొనే అవ‌కాషాలు ఎక్కువ. తరచూ ఛాతీ నొప్పి వస్తే పరీ క్షలు చేయిం‌చుకుని కారణాలను నిర్ధారిం‌చు కోవాలి. ధూమ’పాన ప్రియులు, ఊబకా’యులు, వంశ పారంపర్య చరిత్ర ఉన్నవారి విష’యంలో మరింత జాగ్రత్త అవసరం.

గుండె పోటు రాకుండా ధూమపానం మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకో వాలి. తీపి, ఉప్పు, నెయ్యి తగ్గించాలి. రెడ్ మీట్ (బీఫ్, పోర్క్, మటన్) తగ్గించాలి. వనస్పతి నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రాసెడ్‌, ప్యాకేజ్‌ ఫుడ్స్‌ తినకూడదు. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌, జాగింగ్‌ లేదా స్విమ్మింగ్‌ చేయాలి. వారంలో ఐదు రోజులు ఏదో ఓ వ్యాయామం తప్పనిసరి. మధు’మేహం, కొలె’స్ర్టాల్‌ నియం’త్ర’ణలో పెట్టుకో’వాలి. ఎప్ప‌టిక‌ప్పుడు బీపీ ప‌రీక్షించుకోవాలి. ఆక’స్మిక వ్యాయామాలు, మితి’మీరిన శారీరక శ్రమ వద్దే వద్దు. యోగా, ధ్యానం దినచర్యలో భాగం చేసుకో.

ఈసీజీ ద్వారా గుండె సమస్యను గుర్తించవచ్చు. కొంతమం’దికి మొద‌టిసారి చేస్తే ఈసీజీలో సమస్య బయ‌టప‌డదు. ఈసీజీ సాధరణంగా ఉందంటే సమస్య లేదని అర్థం. రెండుమూడుసార్లు తీస్తే అందులో సమస్య బయ’టపడే ఆస్కారం ఉంది. ఎకో, ట్రోపోనిన్‌ పరీక్షలు చేయిం‌చు కోవాలి. చి‌కిత్సా ప‌ద్ధ‌తులు యువ‌త‌లో సాధ‌ర‌ణంగా ఒకే బ్లాక్‌లో ఉంటుంది. అదే వయోధి'కులలో మల్టిపుల్ బ్లాక్స్' ఉంటాయి.

నిపుణులు రక్తనాళాల్లో ఏర్పాడిన బ్లాక్‌ ఆధారంగా స్టెంట్‌ వేస్తారు. రక్తం పలుచబడే ఇంజక్షోన్లతో కూడా చికిత్స ఇస్తారు. కానీ ఛాతీ నొప్పి వచ్చిన మూడు గంటల్లోపు ఇస్తేనే ఫలితం ఉంటుంది. 12 గంటలు గడిచాక ఈ చికిత్స సమర్ధంగా పనిచెయ్యదు. బ్లడ్‌ థిన్నర్‌ ఇంజ‌క్షన్‌ తీసుకున్న తరు‌వాత రోగికి కచ్చితంగా అంజియోగ్రామ్‌ చేయించాలి. అవ‌స‌ర‌మైతే బైపాస్‌ సర్జరీ చేయవలసి ఉంటుంది. డాక్టర్ వి. వినోద్ కుమార్ సీనియర్‌ ఇంట‌ర్వెన్ష‌నల్‌ కార్డియాల‌జిస్ట్.